ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. 984 అడుగుల లోతున ప్రవహిస్తున్న భాగీరథి నదిలోకి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 21 మంది జలసమాధి కాగా, మరో 9 మంది గల్లంతయ్యారు. మంగళవారం సాయంత్రం ఈ విషాదం జరిగింది.
ప్రమాద వార్త గురించి తెలుసుకున్న ఇండో-టిబెటన్ సరిహద్దు భద్రతా బలగాలు, జాతీయ విపత్తు సహాయక దళాలు రంగంలోకి దిగి 20 మృతదేహాలను వెలికితీశారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు. కాగా, బస్సులో ఉన్నవారిలో అత్యధికులు ఇండోర్వాసులే. వీరంతా చార్ధామ్ యాత్రకు వచ్చి మృత్యుఒడిలోకి చేరుకున్నారు.