కర్ణాటకలో రూ.10వేల కోసం పందెం కాసి 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కార్తీక్ తన స్నేహితులతో కలిసి పందెం వేసిన తర్వాత ఐదు బాటిళ్ల మంచి మద్యం తాగాడు. తన స్నేహితులైన వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురికి తాను ఐదు బాటిళ్ల మద్యం తాగుతానని బెట్ కట్టాడు. ఇందుకోసం అతని స్నేహితులు పదివేల రూపాయలు ఇస్తామని పందెం కాశారు.
కానీ చికిత్స పొందుతూ అతను మరణించాడు. కార్తీక్కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అతనికి ఎనిమిది రోజుల బిడ్డ కూడా ఉన్నాడు. ఇకపోతే.. వెంకట రెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురు వ్యక్తులపై నంగలి పోలీస్ స్టేషన్లో పోలీసు కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.