ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

ఠాగూర్

గురువారం, 1 మే 2025 (08:19 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన ఓ యువ ఉపాధ్యాయురాలు (23) తన వద్ద ట్యూషన్‌కు వచ్చే 11 యేళ్ల బాలుడుతో ప్రేమలోపడింది. అతనికి మాయమాటలు చెప్పి తీసుకుని పారిపోయింది. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట నాలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది. బుధవారం ఓ తెల్లవారుజామున రాజస్థాన్ సరిహద్దుల్లో ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని సూరత్‌కు తరలించారు. ఉపాద్యాయురాలు తన కుమారుడుని కిడ్నాప్ చేసినట్టు విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. 
 
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరూ తమతమ ఇళ్ళలో కుటుంబ సభ్యుల తిట్లు పడలేకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తేలింది. అదేప్రాంతంలో గత రెండుమూడేళ్లుగా నివసిస్తున్న వీరిద్దరి కుటుంబాలకు పరస్పర పరిచయాలు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరూ కలిసి వెళ్లినట్టు గుర్తించారు. బాలుడు వయసు 11 యేళ్ల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, వారిద్దరి అనుబంధంపై మాత్రం పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు