తిరువనంతపురంలో కలకలం.. అర్థరాత్రి 300 మందితో పార్టీ.. బెల్లీ డ్యాన్స్‌..

బుధవారం, 8 జులై 2020 (19:11 IST)
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పార్టీల గోల మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు సర్కారు విధించిన నిబంధనలను అధిగమించి.. 300మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని హిల్లీ జిల్లాలోని ఉదుంబంచోలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి తెలిసిందని పోలీసులు తెలిపారు. జూన్ 29 అర్థరాత్రి ఈ కార్యక్రమం జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైందని తెలిపారు. మేనేజర్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసుకు సబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
 
జూన్ 29 రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు ఈ పార్టీ జరిగిందన్నారు. ఈ పార్టీలో బెల్లీ డ్యాన్స్ వంటివి చోటుచేసుకున్నాయని, ఇందులో డ్యాన్స్ చేసిన డ్యాన్సర్‌ను పక్క  రాష్ట్రం నుంచి రప్పించినట్లు తెలిసింది. మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పార్టీకి హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు