ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

ఠాగూర్

బుధవారం, 18 జూన్ 2025 (16:26 IST)
అహ్మదాబాద్‌‍లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో విశ్వాస్ రమేష్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే తన సోదరుడు అంత్యక్రియల్లో పాల్గొని, సోదరుడు పాడె మోశాడు. ఈ దృశ్యం నెట్టింట ఎమోషనల్‌గా మారింది. ఈ విమానంలో అతడితో పాటు ప్రయాణించిన అతని సోదరుడు అజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయిన విషయంతెల్సిందే. 
 
విశ్వాస్ కుమార్ మంగళవారంర రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత అతడి సోదరుడి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. డయ్యూకు చెందిన విశ్వాస్, అజయ్‌లు తమ కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత లండన్‌కు తిరిగి వెళుతూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
 
బుధవారం ఉదయం డయ్యూలో అజయ్ అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడు పార్థివదేహాన్ని చూసి విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యారు. అతడు సోదరుడు పాడె మోస్తున్న వీడియో నెట్టింట పలువురుని కంటతడి పెట్టించింది. ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ రమేశ్ విశ్వాస్‌ను ఆస్పత్రిలో ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు