అలీఘర్లోని మనోహర్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమార్తె కాబోయే వరుడితో పెళ్లికి తొమ్మిది రోజుల ముందు పారిపోయిన వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రెండు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ మహిళ తన కుమార్తె వివాహానికి కొనిపెట్టిన బంగారు ఆభరణాలు, నగదుతో పారిపోయింది. దీంతో ఆమె కుటుంబం ఇబ్బందుల్లో పడిందని సమాచారం.
ఏప్రిల్ 16న జరగనున్న వివాహానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని కాబోయే వధువు తండ్రి జితేంద్ర కుమార్ తెలిపారు. పెళ్లి పత్రికలు పంపిణీ చేశామని.. కుటుంబం ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పుడు అతని భార్య, వరుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అదనంగా, ఆ మహిళ ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, వేడుక కోసం పక్కన ఉంచిన నగదుతో సహా అన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లిందని ఆరోపించారు.
వరుడు తన కూతురితో చాలా తక్కువగా సంభాషించేవాడని, కానీ అతను తరచుగా ఆమె తల్లితో ఫోన్లో చాలాసేపు మాట్లాడే వారని జితేంద్ర పోలీసులకు చెప్పాడు. ఇకపై తల్లితో మాకెలాంటి సంబంధాలొద్దని.. ఆభరణాలు, నగదు మాత్రం పోలీసులు తిరిగి ఇప్పించాలని జితేంద్ర, వధువు డిమాండ్ చేశారు.