అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్

సెల్వి

శనివారం, 6 సెప్టెంబరు 2025 (23:15 IST)
Law Student
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌పై దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 60 చెంపదెబ్బలు కొట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు పాల్పడిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, లక్నో అమిటీ క్యాంపస్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న షికార్ ముఖేశ్ కేసర్వానీపై ఆగస్టు 26న యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో ఈ దాడి జరిగింది. 
 
ఇటీవలే కాలికి లిగమెంట్ సర్జరీ చేయించుకున్న షికార్, ఊతకర్రల సాయంతో నడుస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు.  ఇద్దరు అమ్మాయిల గురించి షికార్ అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడి తండ్రి ముఖేశ్ కేసర్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

A video of an Amity University law student in UP's Lucknow being slapped by classmates atleast 26 times in over a minute has surfaced on social media. The trigger behind this incident is yet to be ascertained. pic.twitter.com/FssBFAvEuT

— Piyush Rai (@Benarasiyaa) September 5, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు