సిర్సా కూరగాయల మార్కెట్కు వచ్చిన రెండు బాక్సుల కాశ్మీర్ యాపిల్స్ను తెరిచి చూడగా, వాటిలోని రెండు యాపిల్స్పై భారత వ్యతిరేక నినాదాలు కనిపించాయి. 'మాకు స్వాంతంత్ర్యం కావాలి', 'కుక్కలు వెనక్కి వెళ్లిపోవాలి' అనే నినాదాలు ఈ యాపిల్స్పై రాసి ఉన్నాయి.
ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇంకా ఆ బాక్సులోని ఓ యాపిల్పై తాము కాశ్మీర్, పుల్వామాకు చెందిన స్వాతంత్ర్య యోధులం అనే స్లోగన్ కూడా ఉంది. ఈ పండ్ల పెట్టెను కొన్న హరీష్ కుమారుడు పరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. యాపిల్స్పై అభ్యంతకర వ్యాఖ్యలు ఉన్నట్టు చెప్పాడు. కశ్మీర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న భారత సైన్యాన్ని కాశ్మీరీలు ఎలా విస్మరించగలరని ప్రశ్నించాడు.