కోడలి అశ్లీల చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టిన అత్తమామలు...

మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:19 IST)
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్తమామయ్యలే ఆమె పాలిట క్రూర మృగాలుగా మారారు. ఆమెను బజారుపాల్జేసి దారుణానికి తెగబడ్డారు. కోడలి అశ్లీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని నెట్లో పెట్టేసారు. దీనితో ఆమె తీవ్రమైన మనస్థాపానికి గురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే....
 
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చెప్పుల షాపు నడిపే వ్యక్తి మరణించడంతో అతడి భార్య అత్తమామల దగ్గరే వుంటోంది. ఈ క్రమంలో తన భర్తకు సంబంధించిన బ్యాంకు వివరాలతో పాటు ఆస్తి వ్యవహారాలను తనకు ఇవ్వాల్సిందిగా కోడలు అడిగింది. అంతే... ఆమెను ఇంటి నుంచి ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు అత్తామామలు. 
 
ఆమె ఫోటోలను తీసుకుని వాటికి మార్ఫింగ్ చేసి దుస్తులు లేకుండా చేశారు. ఆ ఫోటోలను నెట్లో పెట్టి బజారున పడేశారు. ఈ దారుణం తన దృష్టికి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు