ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసిన బీజేపీ నేతలు.... ఎక్కడ?

సోమవారం, 1 జనవరి 2024 (08:26 IST)
సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పట్టణంలో దారుణం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసి వీడియో తీసి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం వైరల్ కావడంతో ఆ ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, బహిష్కరణకు గురైన ముగ్గురు బీజేపీ నేతల హోదాను మాత్రం బీజేపీ పెద్దలు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐఐటీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థినని గత యేడాది నవంబర 2వ తేదీ తెల్లవారుజామున లైంగికంగా వేధింపులకు గురైంది. బైకుపై వచ్చిన నిందితులు క్యాంపస్‌లోనే ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ఆమె దుస్తులు విప్పేస్తూ వీడియో తీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. 
 
యూనివర్శిటీ ప్రాంగణంలో భద్రత పెంచాలని కోరింది. ఈ ఘటన యూపీలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అలాగే, అనేక పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో దిగివచ్చిన బీజేపీ సర్కారు.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు నేతలను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వారణాసి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ తెలిపారు. నిందితులను కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్ష్యం పటేల్‌గా గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు