పనిమనిషితో ఇంట్లోనే భర్త రొమాన్స్.. భార్య ఏం చేసిందో తెలుసా?

బుధవారం, 27 నవంబరు 2019 (14:47 IST)
సామాజిక మాధ్యమాల ప్రభావం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తున్న నేపథ్యంలో.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా అత్యాచారాలు ఓ వైపు.. కొత్త కొత్త స్నేహాల పేరిట వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం వద్ద నిలదీసిన భార్యను ఓ భర్త చిత్ర హింసలకు గురిచేసిన ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, రాయ్‌పూర్‌లోని దోన్‌గర్‌గఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వీరి ఇంట్లో పనిచేసే మహిళపై కన్నేశాడు దోన్‌గర్‌గఢ్ వ్యక్తి. ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే పనిమనిషి కూడా పరాయి వ్యక్తి అయిన అతని కోరికను పసిగట్టింది.  
 
ఈ క్రమంలో ఇంట్లో భార్య లేని సమయం చూసుకుని పనిమనిషి.. ఇంటి ఓనర్‌తో శారీరికంగా కలిసింది. అయితే ఇద్దరూ ఇక రోజూ బెడ్రూంలోనే చేరి శృంగారంలో మునిగితేలడం పరిపాటిగా మారింది. భార్యకు ఈ విషయం తెలిసింది. ఆపై భర్తను నిలదీసింది. కానీ భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. చివరకు భర్త ఆగడాలకు భార్య ధైర్యం చేసుకుని తన భర్త, పనిమనిషితో నడుపుతున్న వివాహేతర బంధానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను రహస్యంగా తీసి పోలీసులను ఆశ్రయించింది. 
 
అంతేకాదు..తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు