బ్రహ్మపుత్ర నదిపై భారీ విద్యుత్ ప్రాజెక్ట్.. చైనా గ్రీన్‌సిగ్నల్

శుక్రవారం, 12 మార్చి 2021 (17:18 IST)
Bramhaputra
అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర నది మీద భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికను ఆ దేశ పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదించింది. 
 
చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన "త్రీ గోర్జెస్" డ్యామ్‌ ప్రపంచంలోనే భారీ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మపుత్రపై నిర్మించనున్న ఈ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌లో "త్రీ గోర్జెస్" కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
 
టిబెట్ అటానమస్ రీజియన్ (టార్)లో యార్లంగ్‌ జాంగ్‌బోగా, అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్‌గా, అసోంలో బ్రహ్మపుత్రగా ఈ నది ప్రవహిస్తోంది. టిబెట్‌లో పుట్టిన ఈ నది 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. ఈ నది ఎగువ భాగంలో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కూడా కన్నేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు