సీజనల్‌ వ్యాధిగా కరోనా?

శుక్రవారం, 19 మార్చి 2021 (10:10 IST)
కరోనా మహమ్మారి కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది.

కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఐరాస అధ్యయనం చేపట్టింది. కొన్ని వేడి ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి విజఅంభించిందని, వచ్చే ఏడాది ఇలా జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

అత్యంత చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు కరోనా వైరస్‌ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తున్నట్లు గుర్తించామని ఐరాస తెలిపింది.

అయితే వైరస్‌ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.
 
శ్వాసకోశ ఇబ్బందులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు సీజనల్‌గా వస్తుంటాయని నిపుణుల బఅందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజఅంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని, ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు సాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్టుకట్ట వేయగలిగామని తెలిపింది. వాతావరణ అంశాల ఆధారంగా ఆంక్షలను సడలించవద్దని ప్రపంచదేశాలను హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు