యువతకు భారీ దీపావళి ఆఫర్.. 75వేల మందికి ఆఫర్ లెటర్స్

శుక్రవారం, 21 అక్టోబరు 2022 (14:00 IST)
యువతకు భారీ దీపావళి ఆఫర్ వస్తోంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ ఇవ్వనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్ మీటింగ్‌ తర్వాత వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. 
 
ఈ 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో పనిచేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు