చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తర భారతంలో చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోందని ప్లాన్ ఇండియా అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
'క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు'పేరిట ఎన్జీవో ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్, నికోబార్ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి.