యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

సెల్వి

గురువారం, 27 మార్చి 2025 (12:11 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. యూపీ, రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 36 ఏళ్ల వ్యక్తి తన నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గురువారం పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మన్పూర్ చాచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్ తన ముగ్గురు కుమార్తెలు స్మృతి (12), కీర్తి (9), ప్రగతి (7), ఐదేళ్ల కుమారుడు రిషబ్‌లను హత్య చేశాడని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది తెలిపారు. రాజీవ్ వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి బుధవారం రాత్రి తన ఇంట్లోని మరో గదిలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 
 
రాజీవ్ ఉదయం తలుపు తెరవకపోవడంతో, పైకప్పు ఎక్కి మెట్ల గుండా ఇంటి లోపలికి వెళ్ళి మృతదేహాలను వెలికితీశారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో రాజీవ్ తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సంఘటన జరిగిన ముందు రోజు భార్య ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ సంఘటన వెనుక గల కారణం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు