మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఐదుగురు మృతి.. కారణం ఏంటి?

సెల్వి

మంగళవారం, 13 ఆగస్టు 2024 (15:58 IST)
బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని పోలీస్ క్వార్టర్స్‌లో మృతదేహాలు లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల్లో నీతూ కుమారి అనే కానిస్టేబుల్, ఆమె భర్త పంకజ్ కుమార్, వారి ఇద్దరు పిల్లలు, పంకజ్ తల్లి ఉన్నారు.
 
భాగల్‌పూర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) వివేకానంద్ మాట్లాడుతూ, ఈ సంఘటన కుటుంబ కలహాలతో ముడిపడి ఉందని తెలిపారు.
 
ఘటనా స్థలంలో పంకజ్ కుమార్ రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్ లభ్యమైంది. పంకజ్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పంకజ్ కుమార్ తన భార్య నీతూ కుమారి, అతని తల్లి, వారి ఇద్దరు పిల్లలను చంపడానికి ముందు హత్య చేసి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తెలియవచ్చింది. 
 
 
 
నీతూ కుమారి 2015 నుండి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబంతో కలిసి పోలీసు లైన్‌లో నివసిస్తున్నారు. ఆమె మరియు పంకజ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలను కలిసి పెంచుతున్నారు. పంకజ్ తల్లి కూడా వారితో పాటు అధికారిక క్వార్టర్స్‌లో నివసించేది. 
 
ఇటీవలే నీతు వివాహేతర సంబంధం పెట్టుకుందని పంకజ్ అనుమానించడంతో వారి సంబంధం చెడిపోయిందని ఈ కారణంతోనే ఏర్పడిన గొడవలు ప్రాణాల మీదకు తెచ్చాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు