భార్యను స్నేహితులతో గ్యాంగ్‌రేప్ చేయించిన భర్త.. ఎక్కడ?

శనివారం, 25 నవంబరు 2017 (08:31 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో దగ్గరుండిమరీ సామూహిక అత్యాచారం చేయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుథియానాకు చెందిన ఓ మహిళ మూడేళ్లక్రితం కూలీ పనిచేసే ఓ వ్యక్తిని ఆమె పెళ్లాడింది. ఇద్దరికీ అది రెండో పెళ్లి. అయితే, ఆమెతో పిల్లలుకనడం ఇష్టంలేని భర్త.. ఆమెకు ఎనిమిదిసార్లు గర్భస్రావం చేయించాడు. ఆపై ఆమెకు పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ చేశాడు. 
 
ఇంతలో ఆ కామాంధభర్త మరో మహిళపై మోజుపడ్డాడు. దీంతో తన భార్య నుంచి వేరుపడేందుకు విడాకులివ్వాలని లేనిపక్షంలో రేప్‌ చేయిస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ బెదిరింపులకు ఆమె లొంగలేదు. దీంతో అతని చివరకు అన్నంతపనీ చేశాడు. గత జూన్‌ 6న ముగ్గురు స్నేహితులను భార్య ఉన్న గదిలోకి పంపి తాళం వేసి అత్యాచారం చేయించాడు. ఆ కామాంధులు గదిలో రేప్ చేస్తుంటే భర్త మాత్రం బయట ఉండిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె స్థానిక మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు