పదో తరగతి బాలికను అలా తాకాడు... ఏం చేసిందంటే...?

గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:34 IST)
తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పదవ తరగతి చదువుతున్న బాలిక ఒక వ్యక్తిని చితకబాదింది. స్నేహితురాళ్ల సహాయంతో ఆమె ధైర్యంగా అతడికి దేహశుద్ధి చేసింది. పోకిరిగాళ్లకు గట్టిగా హెచ్చరికలు పంపింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతున్న ఆమెను వెంబడిస్తూ బాలిక చేతులను వెనుకకు లాగుతూ ఆమెను ఇబ్బందికి గురి చేసాడు. అతని ప్రవర్తనతో విసుగు చెంది, తీవ్రమైన కోపంతో తన పాఠశాల విద్యార్థినుల సహాయంతో అతడిని చితక్కొట్టింది. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సమాజంలో తిరుగుతున్న మానవ మృగాళ్లకు భయపడవద్దని, స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని, అవసరమైతే ఎదురుదాడి చేసేందుకు ఆలోచించవద్దంటూ, ఇలాంటి వారికి రానున్న రోజుల్లో గుణపాఠం చెప్పాలంటూ పేర్కొంది. ఆమె ధైర్యసాహసాలకు పాఠశాల యాజమాన్యం అభినందించింది. సాటి విద్యార్థులు కూడా ఆమెలా ధైర్యంగా ఉండాలని సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు