హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు...

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:21 IST)
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. రోహింగ్యాలకు పట్టున్న రఖినే జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
రోహింగ్యా ముస్లిం మిలిటెంట్లే వీరిని హత్య చేసినట్టు చెబుతున్నారు. ముస్లింల దాడితో అక్కడి వేలాదిమంది హిందువులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆగస్టు 25న జరిగిన దాడులతో వారు తమపై కక్ష పెంచుకున్నారని, తమను లక్ష్యంగా చేసుకున్నారని హిందువులు చెబుతున్నారు. 
 
రోహింగ్యా ముస్లింలు హత్య చేసిన 28 మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అత్యంత దారుణంగా, క్రూరంగా హతమార్చినట్టు ఆర్మీ చీఫ్ వెబ్‌సైట్ పేర్కొంది. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) గ్రూప్ వీరిని హతమార్చినట్టు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు