కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అపరాధం.. ఎందుకో తెలుసా?

బుధవారం, 6 జనవరి 2021 (09:37 IST)
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు ఆ రాష్ట్ర హైకోర్టు అపరాధం విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకుగాను కోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుని 25 వేల రూపాయల అపరాధాన్ని విధించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది. కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు. డీనోటిఫికేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బంధువులకు కూడా మేలు జరిగిందని ఆయన ఆరోపించారు. 
 
తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ.25 వేల జరిమానా విధించారు. కాగా, యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు గతంలోనే నిరాకరించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు