భారత్ పోరాడుతుంది.. తిరిగి నవ్వుతుంది : ప్రధాని మోడీ

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:31 IST)
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ శక్తికిమించి పోరాడుతోందని, భారత్ తిరిగి నవ్వుతుందని, ఈ మహమ్మారిపై భారత్ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 
 
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఓ మ్యూజిక్ వీడియోను కూడా జతచేశాడు. "భారత్ తిరిగి నవ్వుతుంది, భారత్ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇపుడు ట్విట్టర్‌లో వైరల్ అయింది. 
 
అలాగే, మోడీ అటాచ్ చేసిన మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు. 
 
'ముస్కురాయేగా ఇండియా' పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించడంతో వైరల్ అయింది.

 

फिर मुस्कुराएगा इंडिया...

फिर जीत जाएगा इंडिया...

India will fight. India will win!

Good initiative by our film fraternity. https://t.co/utUGm9ObhI

— Narendra Modi (@narendramodi) April 7, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు