జయలలితకు స్లో-పాయిజన్ ఇచ్చి శశికళ చంపేసింది: కేసు పెడతానన్న సుప్రీం లాయర్

గురువారం, 8 డిశెంబరు 2016 (16:15 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి పక్కనే ఖననం చేశారు. జయలలిత మృతితో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. గత సెప్టెంబర్ 22వ తేదీ అపోలోలో చేరిన జయలలిత 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. చికిత్స ఫలించక మృతి చెందారు.

జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఎవ్వరూ పరామర్శించలేకపోయారు. ఫోటోలు విడుదల కాలేదు. ఆమె గొంతు కూడా వినలేకపోయారు. దీంతో అమ్మ మరణంలో అనుమానాలున్నాయని చాలామంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు లాయర్ కృష్ణమూర్తి జయలలిత మృతిపట్ల శశికళపై డౌట్ ఉన్నట్లు సంచలన ఆడియో రిలీజ్ చేశారు. 
 
అందులో జయలలిత ఆస్తులను అపహరించాలనే ఉద్దేశంతోనే.. శశికళ జయలలితను చంపేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. స్లో పాయిజన్ ఇచ్చిన విషయం తెలుసుకునే జయలలిత శశికళను ఇంటి నుంచి బయటకు నెట్టేశారని.. అందుకే శశికళపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కృష్ణమూర్తి ఆవేశంగా ఆ ఆడియోలో మాట్లాడారు. 

ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య చర్చనీయాంశమైంది. మరి కృష్ణమూర్తి రిలీజ్ చేసిన ఆడియో నిజమైందేనా? శశికళపై ఆయన కేసు పెడతారా? లేదా? అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి