అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సందిగ్ధత వీడట్లేదు. ఆమె ఆరోగ్యంపై వారం తర్వాత బులిటెన్ విడుదల కాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వదంతలు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ నిపుణులతో ఎప్పటికప్పుడు పోలీసులు తొలగింపజేస్తున్నారు. కొద్దివారాలుగా వదంతులు సృష్టిస్తున్న వారిపై 50 కేసులు నమోదుకాగా, ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.
సోషల్మీడియా వినియోగదారులెవరూ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్లు విడుదల చేసిన వైద్యులు వారంరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోడంపై తమిళనాడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.