నాలుగో తరగతి చిన్నారిపై కాంపాస్‌తో 108 సార్లు పొడిచిన సహ విద్యార్థులు...

మంగళవారం, 28 నవంబరు 2023 (09:52 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదివే చిన్నారిపై సహ విద్యార్థులు జామెట్రీ బాక్స్‌లోని కాంపాస్‌తో 108 సార్లు పొడిచాడు. ఇండోర్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌కు చెప్పేందుకు భయపడిన బాధిత విద్యార్థి.. ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఇండోర్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆరాధ్య పాండే అనే నాలుగో తరగతి విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడి చేశారు. జామెట్రీ కంపాస్‌తో ఏకంగా 108 సార్లు పొడిచారు. ఈ చిన్నారుల మధ్య జరిగిన అనూహ్యం ఘటనతో ఈ ఘటన జరిగింది. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై ఎయిర్‌డ్రోమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
ఈ ఘటనను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరాధ్య పాండే తండ్రి ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరవరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మధ్య చిన్న గొడవి అనూహ్యంగా ఈ దాడికి కారణమైనందని తెలుస్తుంది. కాగా, బాలుడికి వైద్య పరీక్షలు జరిగాయని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులందరూ పదేళ్ల లోపు వారేనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
 
మరోవైపు, ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా దృష్టి సారించింది. త్వరలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. వీడియో గేమ్స్‌‌లోని హింసాత్మక దృశ్యాల ప్రభావం పిల్లలపై పడిందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు