చిన్నతనంలో కానూ గాంధీ మహాత్ముడి వెన్నంటే ఉండేవారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్ముడి ముందు నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా గత నెల 22న కానూ గాంధీ గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. దాంతోపాటు బ్రెయిన్ హెమరేజ్ కారణంగా సగం శరీరం చచ్చుబడిపోయిందన్నారు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, అనంతరం కోలుకోలేదని ఆయనకు అత్యంత సన్నిహితుడు ధిమంత భాదియా తెలిపారు.