వైద్యానికి డబ్బుల్లేక... మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి

మంగళవారం, 8 నవంబరు 2016 (09:51 IST)
వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి చెందారు. ఈయన నాసా మాజీ శాస్త్రవేత్త కావడం గమనార్హం. కొంతకాలంగా ఆస్వస్థతతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆయన స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహాయకులు వెల్లడించారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 
 
చిన్నతనంలో కానూ గాంధీ మహాత్ముడి వెన్నంటే ఉండేవారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్ముడి ముందు నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా గత నెల 22న కానూ గాంధీ గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. దాంతోపాటు బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణంగా సగం శరీరం చచ్చుబడిపోయిందన్నారు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, అనంతరం కోలుకోలేదని ఆయనకు అత్యంత సన్నిహితుడు ధిమంత భాదియా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి