మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న వదిన.. తెలిసి తమ్ముడికి పెళ్లి చేసిన అన్న

సోమవారం, 31 అక్టోబరు 2022 (08:55 IST)
మరిదితో వదిన అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలిసింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలోచన చేయకుండా తన భార్యను తమ్ముడికి పెళ్లి చేశాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని నదియా జిల్లా శాంతిపూర్‌కు చెందిన అమూల్య దేబ్నాథ్ అనే వ్యక్తికి బబ్లా ప్రాంతానికి దీపాలి అనే మహిళతో గత 24 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 22 యేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతడికి కూడా వివాహమైంది. వృత్తిరీత్యా అమూల్య దేబ్‌‍నాథ్ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో దీపాలి తన భర్త సోదరుడు కేశబ్‌ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమూల్య... వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. తన భార్యతో కాపురం చేయలేనని, అందువల్ల తన భార్యను సోదరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి, అదే విధంగా వివాహం చేసాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు