Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

సెల్వి

శనివారం, 31 మే 2025 (15:06 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన వదినను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. ఆ తర్వాత నరికివేయబడిన తల, రక్తంతో తడిసిన ఆయుధాన్ని తీసుకుని వీధుల్లో తిరిగాడు.
 
ఆపై బసంతి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరుపుతున్నారు.  నిందితుడిని బిమల్ మండల్‌గా గుర్తించారు. మృతురాలిని సతి మండల్‌గా గుర్తించారు. ఆమె నిందితుడి అన్నయ్యను వివాహం చేసుకుంది.
 
కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మృతురాలికి, నిందితుడికి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలే హత్యకు దారి తీసి వుంటాయని పోలీసులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు