తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

సెల్వి

శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:38 IST)
Marriage
తమిళనాడులో విషాధ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం ముందే కుమారుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలో కవణై గ్రామం ఉంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఊరికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా.. ఆయనకు అప్పు కుమారుడు.. ప్రస్తుతం లా చదువుతున్నాడు. 
 
అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ప్రియురాలు కూడా ఓకే చెప్పింది. అంతే తండ్రి భౌతిక కాయం ముందే ప్రేయసి మెడలో తాళి కట్టేశాడు. 
 
కన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు. కొత్త జంటను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు ఆశీర్వదించారు. కాకపోతే అమ్మాయి తరఫు బంధువులు ఈ పెళ్లికి రాలేదు.. పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

తండ్రి మృతదేహం ఎదుట వివాహం చేసుకున్న కుమారుడు

తమిళనాడులోని కడలూరు జిల్లా కవణ్ణైలో రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన రెండో కుమారుడు న్యాయ విద్యార్థి అప్పు, డీగ్రీ విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమయాణం. ఇరు కుటుంబాలతో వివాహం చేసుకోవాలని… pic.twitter.com/JzuuyHuEvt

— ChotaNews App (@ChotaNewsApp) April 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు