మణిపూర్‌లో దారుణం.. మొండెం నుంచి తలను వేరు చేసి?

శనివారం, 22 జులై 2023 (10:01 IST)
మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జాతుల మధ్య ఘర్షణలతో ఓ వ్యక్తిని చంపిన ఓ వర్గం ప్రజలు అతడి మొండెం నుంచి తలను వేరు చేసి దానిని కంచెకు తగిలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బిష్ణుపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ నెల 2న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
 
అదే రోజు రాత్రి జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంచెకు వేలాడదీసిన తలను డేవిడ్‌దిగా గుర్తించారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు