రోడ్లపై దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలో కాలుష్యనియంత్రణ కోసం డీజిల్ వాహనాలను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనాలను డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చుకోవడానికి ఇంకా సమయం కావాలని పెట్టుకున్న పిటిషన్ను శనివారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో మే 1వ తేదీ నుంచి డీజిల్తో నడిచే క్యాబ్స్ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ఈ పరిస్థితి నెలకొంది.