శనివారం నాడు మేకర్స్ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ను అందించారు. పెద్ద స్క్రీన్పై ఉత్కంఠభరితమైన యాక్షన్ అడ్వెంచర్ను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ, మిరాయ్ కోసం ఆగస్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్లను అందించడానికి అవసరమైన విస్తృతమైన VFX పని కారణంగా విడుదల ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ పోస్టర్లో తేజ సజ్జ ఎత్తైన మంచు శిఖరాల మధ్య నిలబడి, చేతిలో పవర్ఫుల్ ఆయిదం పట్టుకుని చూస్తున్నట్లు కనపడుతోంది.
కాగా, ఇటీవలే నేపాల్లో షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మనోజ్ మంచు విలన్గా నటిస్తుండగా, తేజ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. సాంకేతికసిబ్బందిగా, వివేక్ కూచిబొట్ల, కృతిప్రసాద్, సుజిత్కొల్లి, మణిబ్కరణం, గౌరహరికె శ్రీనాగేంద్ర ఉన్నారు.