ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని భావిస్తున్న సమయంలోనే ఈ దొంగతనం కాస్త జరిగిపోయిందని అధికారులు చెప్పారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గర్భగుడి తలుపులు తీసిన వేళ, సేఫ్టీ అలారం పనిచేయలేదని.. గుడి గురించి తెలిసిన వారే ఆ లింగాన్ని దోచుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరకత లింగం చోరీ కావడం పట్ల ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆలయ సూపరింటెండెంట్ ఎం.శవురిరాజన్ ప్రకారం.. ఆదివారం ఉదయం లింగానికి పూజాకార్యక్రమాలు పూర్తిచేసిన అనంతరం పూజారి మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఆయన ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతుండగా శివలింగం లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇకపోతే.. ఈ లింగం వెలలేనిది.. అమూల్యమైనది.