2 రోజులు.. పోర్న్ వీడియో చూసి.. ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం..

మంగళవారం, 17 జులై 2018 (10:21 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కలకలం రేపుతోంది. తొమ్మిదేళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురు.. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసి.. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
 
వివరాల్లోకి వెళితే.. సాహస్‌పూర్‌కు చెందిన బాలురు ఆడుకుందామని బాలికను నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రెండు రోజులు ముందు ఫోన్‌లో పోర్న్ సినిమా చూసినట్టు నిందితుల్లో ఒకడైన బాలుడు చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్లాన్ చేసినట్టు చెప్పాడు. 
 
గురువారం ఈ ఘటన చోటుచేసుకుందని.. ఆదివారం బాలురను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సాహస్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నరేశ్ రాథోడ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు