మోదీ 3.0 మ్యాజిక్‌తో రాహుల్ గాంధీకి రూ.46.49 లక్షల లాభమా?

సెల్వి

మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:51 IST)
Rahul Gandhi
మోదీ 3.0 మ్యాజిక్‌తో భారత స్టాక్ మార్కెట్ల ఆశ్చర్యకరమైన వృద్ధిపై కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ తన స్టాక్ పెట్టుబడుల నుండి 46.49 లక్షల రూపాయల భారీ లాభాన్ని ఆర్జించారని డేటా తెలిపింది. 
 
అదీ కేవలం ఐదు నెలల్లోనే రాహుల్ గాంధీ రూ.46.49 లక్షల్ని స్టాక్ మార్కెట్‌ ద్వారా రాహుల్ గాంధీ ఆర్జించినట్లు తెలుస్తోంది. ఈ పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు రూ. 4.33 కోట్ల నుంచి (ఎన్నికల అఫిడవిట్ ద్వారా వెల్లడైన మార్చి 15, 2024 నాటికి) దాదాపు రూ. 4.80 కోట్లకు (ఆగస్టు 12, 2024 నాటికి) పెరిగిందని తాజా నివేదిక పేర్కొంది. 
 
రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎంఎం, హిందూస్థాన్ యునిలిర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ స్టాక్స్ షేర్లు బాగా పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది. 


రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 24 స్టాక్‌లు ఉన్నాయి. వాటిలో మైండ్‌ట్రీ, టైటాన్, టీసీఎస్, నెస్లే ఇండియా అనే నాలుగు కంపెనీలలో మాత్రమే నష్టాలను చవిచూశాయి. 
 
ఇవి కాకుండా, వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్, వినైల్ కెమికల్స్ వంటి అనేక చిన్న కంపెనీల స్టాక్‌లు కూడా కాంగ్రెస్ నాయకుడి పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
 
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ మోపిన సెబి చీఫ్‌పై అభియోగాలపై జెపిసి విచారణను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు