యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం... మహనీయుల పుట్టినరోజు సెలవులు రద్దు

శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (13:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతిగర్వించదగ్గ మహనీయుల జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించడాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గొప్పవారి ఘనతను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందుకే ఆ రోజున సెలవులు రద్దు చేసి.. వారి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని తెలిపారు. 
 
లక్నోలో శుక్రవారం జరిగిన బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ, అబ్దుల్ కలాం కన్నుమూసినప్పుడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తే, విమర్శలు చెలరేగిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మరింతగా కష్టపడాలని అన్నారు. ఇప్పుడు యూపీ సీఎం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే పాలనలో సరికొత్త పంథాతో దూసుకెళుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి