భార్య గాఢనిద్రలో ఉంటే... కుమార్తె నోటికి ప్లాస్టర్ వేసి రేప్ చేసిన తండ్రి

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:14 IST)
ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో దారుణం జరిగింది. పక్కనే భార్య గాఢ నిద్రలో ఉండగా, కన్నబిడ్డపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ అంటించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నోయిడాకు చెందిన భార్యభర్తలిద్దరూ స్థానికంగా ఉండే బట్టల ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తండ్రి బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి సమయంలో భార్య గాఢనిద్రలోకి జారుకోగానే, మరో గదిలో నిద్రపోతున్న కుమార్తె నోటికి ప్లాస్టర్ అంటించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆ చిన్నారికి రక్తస్రావమై నరకయాతన అనుభవించింది. 
 
మరుసటిరోజు ఉదయం బిడ్డతో కలిసి స్టేషన్‌కు వెళ్లి భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు