దొంగ బాబా అరెస్ట్.. తల్లీకూతుళ్లపై అత్యాచారం.. ఎక్కడ?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:30 IST)
ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు, జాతకాలు, బాబాలపై నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దొంగ బాబాల చేతిలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే వుంది. తాజాగా ఓ దొంగ బాబా తమ సమస్యలు చెప్పుకునేందు వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


అక్కడితో ఆగకుండా.. ఆమె కుమార్తెపై కూడా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ బాబాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధానిలోని హజ్ ఖాన్ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆషు మహరాజ్‌పై ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 నుంచి 2013 వరకూ ఆషు మహరాజ్, ఆయన స్నేహితులు, కుమారుడు సమర్ ఖాన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. నిందితులు తన మైనర్ కుమార్తెపై కూడా అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఈ నెల 10న బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు ఆషు మహరాజ్‌తో పాటు ఆయన కుమారుడు సమర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు