ఢిల్లీలో రెండేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. కాపాడిన తల్లి

సెల్వి

బుధవారం, 24 జనవరి 2024 (22:34 IST)
Dog Attacks
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై శునకం దాడి చేసింది. పెంపుడు కుక్కగా గుర్తించిన ఆ కుక్క పిల్లవాడిపైకి దూసుకెళ్లింది. రెండేళ్ల బాలుడి కాలిని పట్టుకుంది. సిసిటివి కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డ్ అయ్యింది. 
 
కుక్కపై ఆగ్రహంతో కుక్క దాడి నుండి తన బిడ్డను రక్షించడానికి తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. పిల్లవాడి దగ్గరకు పరుగెడుతూ వెళ్లిన కుక్క ఆ చిన్నారిని నోటితో లాగుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. 
 
వెంటనే, స్థానికులు, బాలుడి తల్లి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బిడ్డపై ఆ శునకం పదేపదే దూకి దాడి చేసింది. అయినా స్థానికులు దానిని వదలక తరిమికొట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. 

पूर्वी दिल्ली के विश्वास नगर इलाके में कुत्ते ने एक दो-वर्षीय बच्चे को काट लिया घटना उस समय हुई जब एक महिला अपने कुत्ते के साथ गली में टहल रही थी, और अचानक कुत्ता उस छोटे बच्चे पर हमला कर बैठा #dog pic.twitter.com/LrA0DGdls5

— Lavely Bakshi (@lavelybakshi) January 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు