నేను వేయించుకున్నా... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి.. : ప్రధాని మోడీ

సోమవారం, 1 మార్చి 2021 (12:10 IST)
తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాననీ, అలాగే, ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నారు. ఆయనకు ఎయిమ్స్‌లో పని చేసే పి.నివేదా అనే నర్సు ఈ టీకాను వేసింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ఎయిమ్స్‌లో క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నానని చెప్పారు. క‌రోనాపై పోరాడుతోన్న వైద్యులు, శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆయ‌న కొనియాడారు.
 
క‌రోనాను అంత‌మొందించ‌డానికి వారు వేగంగా కృషి చేస్తున్నార‌ని చెప్పారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాల‌ని తెలిపారు. అంద‌రం క‌లిసి భార‌త్‌ను క‌రోనా ర‌హిత దేశంగా మార్చుదామ‌ని పిలుపునిచ్చారు. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకుని ఈ ల‌క్ష్యాన్ని ఛేదిద్దామ‌ని తెలిపారు.
 
కాగా, మోడీ సోమవారం భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను వేయించుకున్నారు. ఆ సమయంలో ఆయ‌న‌ అసోంలో తయారు చేసిన కండువాను ధరించి క‌న‌ప‌డ్డారు. అసోం, పుదుచ్చేరికి చెందిన రోస‌మ్మ అనిల్‌, పి.నివేద అనే న‌ర్సులు మోడీదీకి వ్యాక్సిన్ వేసే విధి నిర్వ‌ర్తించారు. మోడీకి ఎడ‌మ చేతికి రోస‌మ్మ వ్యాక్సిన్ వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు