రాజా హత్యతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన రఘువంశీ కుటుంబం, పోలీసుల విచారణలో బయటపడుతున్న వాస్తవాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తన సోదరుడుని కిరాయి హంతకులతో వదినే చంపించిందని తెలిసి జీర్ణించుకోలేకపోతోంది.
సోషల్ మీడియా వేదికగా శ్రస్తి తన మనోవేదనను పంచుకున్నారు. సోనమ్కు ఆమె ప్రియుడే ఎక్కువ అనుకుంటే ఇంట్లో నుంచి పారిపోయే అవకాశం ఉందన్నారు. రాజా, సోనమ్ ఇద్దరిని అడిగి తెలుసుకున్నాకే తన తల్లిదండ్రులు ఈ వివాహం చేశారన్నారు. అప్పటికే ప్రియుడు ఉన్నపుడు, ప్రియుడుతోనే కలిసి ఉండాలని అనుకున్నపుడు సోనమ్ తన అన్నతో వివాహమాడేందుకు ఎందుకు అంగీకరించిందని శ్రస్తి ప్రశ్నించింది.
మా అన్నయ్య ఏడు జన్మల తోడుంటానని సోనమ్కు ప్రమాణం చేశాడు. కానీ, ఆమె ఏడు రోజులు కూడా మా అన్నతో ఉండలేకపోయింది. నా సోదరుడు ఏం తప్పు చేసాడని చంపేశావ్.. నీకు వేరొకరు నచ్చితే వారితోనే పారిపోవచ్చు కదా.. ఎందుకు చంపావ్... ఒకరికి సోదరుడుని, మరొకరికి కొడుకును ఎందుకు దూరం చేశావే.. అంటూ తన ఇన్స్టా ఖాతాలో ఓ వీడియోను ఆమె పోస్ట్ చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.