మద్యం సేవించలేదని యువకుడిని దారుణంగా కొట్టి విద్యార్థులు.. (Video)

ఠాగూర్

గురువారం, 12 సెప్టెంబరు 2024 (12:23 IST)
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పలువురు విద్యార్థులు పెడదారిపడుతున్నారు. తాము పక్కదారి పట్టడమే కాకుండా, తమతో ఉన్న విద్యార్థులు కూడా చెడిపోయేలా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా తమతో కలిసి మద్యం సేవించలేదన్న అక్కసుతో సాటి విద్యార్థిని కొందరు విద్యార్థులు కలిసి చితకబాదారు.
 
ఈ దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రా యూనివర్సిటీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వర్శిటీలో ఎంబీఏ విద్యార్థి రజత్ కుమార్‌ను మద్యం సేవించాలని ఇతర విద్యార్థులు ఒత్తిడి చేశారు. అతడు నిరాకరించడంతో ఆగ్రహంతో అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ బెల్టుతో దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

మద్యం తాగలేదని యువకుడిని దారుణంగా కొట్టిన తోటి విద్యార్థులు

హిమాచల్ ప్రదేశ్ - బహ్రా యూనివర్సిటీ ఎంబీఏ విద్యార్థి రజత్ కుమార్‌ను మద్యం సేవించాలని ఇతర విద్యార్థులు ఒత్తిడి చేశారు.

అతడు నిరాకరించడంతో ఆగ్రహంతో అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ బెల్టుతో దారుణంగా కొట్టారు.

దాడికి… pic.twitter.com/D3ZOCupItH

— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు