చావనైనా చస్తాను గానీ... ఢిల్లీ మాత్రం వెళ్లను.. శివరాజ్ సింగ్ చౌహాన్

మంగళవారం, 12 డిశెంబరు 2023 (22:37 IST)
తాను చావనైనా చస్తాను గానీ, ఢిల్లీ మాత్రం వెళ్లను అని మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చౌహాన్.. ఐదోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులైన కొందరు మహిళలు ఆయన వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. 
 
వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "చావనైనా చస్తాను గానీ, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అని అడగడానికి మాత్రం ఢిల్లీకి వెళ్లను అని తేల్చి చెప్పారు. అలాంటివి తనకు నచ్చవని పునరుద్ఘాటించారు. అదేసమయంలో ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు గెలుచుకోలేని చింద్వారా ప్రాంతానికి వెళ్లిపోయారు. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లకుండా చింద్వారా వెల్లడం ప్రతి ఒక్కరీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు