కాలిఫోర్నియాలో సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడి అరెస్టు

శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:28 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ గాయకుడు, రాజకీయ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో ఆయన్ను అరెస్టు చేసినట్టు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
గత మే 29వ తేదీన సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికే క్రమంలో పంజాబ్ ప్రభుత్వం సిద్ధూకు భద్రతను ఉపసంహరించుకుంది. ఆ మరుసటి రోజే ఆయన హత్యకు గురయ్యాడు. ఇది కలకలం రేపింది. సిద్ధూకు నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా, ఇద్దరిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 
 
అయితే, సిద్ధూకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి సాధారణ వాహనంలో బయటకు రావడంతో అప్టికే ఆయన కోసం వేచివున్న దండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు భావించిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ నిఘా వర్గాల కన్నుగప్పి విదేశాలకు పారిపోయాడు. ఇపుడు ఎట్టకేలకు కాలిఫోర్నియాలో అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు