పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

ఠాగూర్

గురువారం, 20 మార్చి 2025 (13:09 IST)
వారంరోజుల ప్రయోగం కోసం అంతరిక్ష పరిశోధనా కేంద్రా(ఐఎస్ఎస్)నికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అనివార్య కారణాలతో అక్కడే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీతా విలియమ్స్‌‍తో సహా ఇతర వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె భూమికి చేరుకున్నారు. 
 
అయితే, అంతరిక్షంలో సుధీర్ఘకాలం ఉండి భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్ భూవాతావరణానికి అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి శరీరం తేలికగా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఆమె ఎముకలు పెళుసుబారి, కండరాలు క్షీణించివుంటాయి. 
 
రేడియేషన్ కారణంగా దృష్టిలోపం వంటి సమస్యలు ఉత్పన్నంకావొచ్చు. రక్తప్రసరణలో తేడా వస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ సమయంలో ఆమె వైద్యుల పర్యవేక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకుని మళ్లీ భూవాతావరణానికి అలవాటు పడాలంటే కనీసం ఒక నెల రోజులైనా సమయం పడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు