గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన టెన్త్ విద్యార్థి.. నడుస్తూ వెళ్తుండగా..?

సెల్వి

సోమవారం, 8 జులై 2024 (14:52 IST)
Tenth class student
గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజుకి పెరిగిపోతోంది. వయోబేధం లేకుండా గుండెపోటుకు గురవుతూ ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ టెన్త్ విద్యార్థి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
రాజస్థాన్ - దౌసాలో ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న యతేంద్ర ఉపాధ్యాయ్(16) క్లాసులోకి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. 
 
సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు