పంజాబ్‌లో దారుణం.. వ్యభిచార రొంపిలోకి తల్లే నెట్టేసింది.. మైనర్‌పై అత్యాచారం

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:39 IST)
మహిళలకు రక్షణ కరువైంది. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్ బటిండాలో దారుణం వెలుగు చూసింది. కన్నతల్లే తన కుమార్తెపై అత్యాచారానికి ఉసిగొల్పింది. చివరికి తల్లి చేసే అరాచకం భరించలేక బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలిక(14) తల్లితో కలిసి బటిండాలోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటోంది. బాధితురాలు తల్లి తొమ్మిదేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి కూతరుతో కలిసి జీవనం సాగిస్తోంది.
 
అయితే, డబ్బు సంపాదన కోసం ఆ తల్లి తన కూతురును వ్యభిచార రొంపిలోకి నెట్టేసింది. తానే దగ్గరుండి తన కూతురుపై అత్యాచారం చేయించేది. తాజాగా జిరాక్ పూర్ హోటల్‌లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది బాలిక తల్లి ప్రమేయంతోనే జరిగింది. 
 
తల్లి అరాచకాలను తట్టుకోలేకపోయిన బాలిక.. జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
జిరాక్‌పూర్ హోటల్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు