మందు పార్టీకి పిలవలేదని గొడవ.. ఫ్రెండ్‌ను చంపి తలను వేరు చేసిన స్నేహితులు

శుక్రవారం, 5 జనవరి 2018 (10:49 IST)
మద్యంమత్తులో నలుగురు యువకులు కలిసి తమ స్నేహితుడిని హత్య చేశారు. ఆ తర్వాత తల, మొండెంలను వేరు చేసి, తలను ఒకచోట, మొండెంను మరోచోట పూడ్చిపెట్టారు. ఈ దారుణం డిసెంబర్ 31వ తేదీ రాత్రి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లా కేంద్రంలోని భారతి మార్కెట్‌ ప్రాంతానికి చెందిన మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్‌లు మంచి స్నేహితులు. వీరంతా కలిసి అప్పుడ‌ప్పుడు మందు పార్టీలు చేసుకునేవారు. ఈ క్రమంలో న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. 
 
ఈవిషయం మదియళగన్‌ చెప్పలేదు. కానీ, ఈ విషయం తెలుసుకున్న మది.. పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వారిని నిల‌దీశాడు. దీంతో చెల‌రేగిన గొడ‌వ‌లో మ‌దియళగన్‌ బీర్‌ బాటిల్‌ తీసుకుని ఓ స్నేహితుడిని పొడవ‌డానికి య‌త్నించాడు. అప్పటికే పీకలవరకు మద్యం సేవించివున్న మిగిలిన స్నేహితులంతా క‌లిసి మదియళగన్‌ను కత్తితో పొడిచి చంపేశారు. 
 
అంతేకాదు... మదియళగన్‌ తలను శరీరం నుంచి వేరు చేశారు. అనంత‌రం తలని, మొండాన్ని ఓ కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టారు. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కపోవ‌డంతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు మదియళగన్ స్నేహితులే అత‌డిని చంపేశార‌ని గుర్తించారు. ముదియ‌ళ‌గ‌న్ స్నేహితులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు మాత్రం ప‌రారీలో ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు