School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

సెల్వి

మంగళవారం, 8 జులై 2025 (09:24 IST)
School van
తమిళనాడు కడలూరులో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు, సెమ్మంకుప్పంకు సమీపంలో ఓ స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ దాటుతుండగా.. ఆ మార్గం గుండా వచ్చిన చిదంబరం రైలు స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో స్కూల్ వ్యాన్‌ కొన్ని మీటర్ల మేర రైలు లాక్కెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. రైలు వచ్చే సమయానికి ఆప్రాంత రైల్వే గేట్ మూతపడకుండా వుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. 
 
మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మయిలాడుదురై మార్గాన వెళ్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం.

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు

ముగ్గురు విద్యార్థులు మృతి.. పలువురికి గాయాలు

తమిళనాడులోని కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలోని ఒక ప్రైవేటు స్కూలు బస్సు, కాపలా లేని ఒక రైల్వే గేటు దాటుతుండగా ఢీకొట్టిన రైలు

ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా, తీవ్రంగా గాయపడిన పలువురు… pic.twitter.com/M3DXsc7wYT

— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు