సాధువులను ఆలయంలోనే హత్య చేశారు.. ఇంతకీ వాళ్లేం చేశారు..?

గురువారం, 16 ఆగస్టు 2018 (11:07 IST)
ఉత్తరప్రదేశ్‌లో సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఔరైయా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న ముగ్గురు సాధువులను మంచానికి కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆపై కత్తితో పొడిచి మెడను కోశారు. ఈ ఘటలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన సాధువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
ఆలయంలోని సాధువులు హత్యకు గురయ్యారన్న వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఆందోళన చేపట్టారు.  పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీసు బలగాలను దింపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు